సాక్షి, తిరుమల: ఇల వైకుంఠం తిరుమలక్షేత్రంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా సాగింది. ముక్కోటి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలోకి భక్తులు వెళ్లే సమయంలో తోపులాటలు జరిగాయి. గతేడా ది 2,800 వీఐపీ టికెట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని 4,200లకు పెంచారు. అర్ధరాత్రి తర్వాత వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించారు. తర్వాత 4.09 గంటకు సామాన్య భక్తులను అనుమతిం చారు. ముక్కోటి దర్శనానికి వచ్చే భక్తులను తొలుత 54 కంపార్ట్మెంట్లలోకి అనుమ తించారు. తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లలోకి, ఆలయ నాలుగుమాడ వీధుల్లోకి అనుమతించారు. వైకుంఠద్వార ప్రవేశంతో సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆలయ వీధుల్లో.. గ్యాలరీల్లో తోపులాటలు
ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావటంతో రావడంతో భక్తులు కింద పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు చవిచూసారు.
సామాన్యులకే ప్రాధాన్యం: ఈవో సాంబశివరావు
వైకుంఠ ఏకాదశిలో శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగానే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అధిక సమయం సామాన్య భక్తులకు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్, చల్లా కోదండరామ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రవిబాబు, తమిళ నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంతోష్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మాల దర్శిం చుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో స్వామివారిని దర్శించుకున్నారు.
ఇల వైకుంఠానికి పోటెత్తిన భక్తజనం
Published Mon, Jan 9 2017 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement