ఓ వైపు కృష్ణా పుష్కరాలు... మరోవైపు వరుస సెలవులు వచ్చాయి.
విజయవాడ : ఓ వైపు కృష్ణా పుష్కరాలు... మరోవైపు వరుస సెలవులు రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ఆమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఐదు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గత అర్థరాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.