అంతర్జాతీయ మార్కెట్కు నిలిచిన ఎగుమతులు
భారీగా పతనమవుతున్న ధరలు
పుణ్యక్షేత్రాల్లో తలనీలాల వేలం పాటకు స్పందన శూన్యం
తణుకు/ద్వారకాతిరుమల: నల్ల బంగారంగా పేరొందిన తలనీలాల(కేశాల) ధర తలకిందులైంది. గతేడాదితో పోలిస్తే మార్కెట్లో కేశాలకు డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వల్ల ధర పతనమవుతోంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేశాల వేలం పాటకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తలనీలాల ఎగుమతిలో పశ్చిమ గోదావరి జిల్లా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. జిల్లాలో గతేడాది తలనీలాల ఎగుమతిలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ జరగ్గా ఈ ఏడాది అందులో 50 శాతం కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు.
కేశాలకు ధర లేకపోవడానికి ప్రధాన కారణం భారత్ నుంచి చైనాకు ఎగుమతులు లేకపోవడమే. కేశాల కొనుగోళ్లను చైనా పూర్తిగా నిలిపివేసిందని, అందుకే నిల్వలు పెరిగి ధర పతనమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఏడాది క్రితం రూ.కోటికి అమ్ముడైన స్పెషల్ గ్రేడ్ సరుకు ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.25 లక్షలు పలుకుతోంది. సాధారణంగా తలనీలాలను పుణ్యక్షేత్రాల్లో కేశఖండనశాలల నుంచి సేకరిస్తుంటారు. వీటిని శుభ్రపర్చి గ్రేడ్లుగా విభజించి చైనా, అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
కేవలం ఐదు శాతం మాత్రం ఇలా పుణ్యక్షేత్రాల నుంచి సేకరిస్తుండగా మిగిలినదంతా ఇళ్ల నుంచి సేకరిస్తారు. ఇళ్లనుంచి కేశాలను సేకరించే చిన్న వర్తకులపై ఇటీవలి కాలంలో సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతుండడంతో ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. పన్ను పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రానికి విజ్ఞప్తి చేశాం
‘‘యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా తలనీలాల ఎగుమతులు క్షీణించాయి. చిరు వ్యాపారులపై సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటింటికీ తిరిగి కేశాలను సేకరించే చిన్న వర్తకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సేల్ ట్యాక్స్ అధికారుల తీరుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇదే పరిస్థితి కొనసాగితే కేశాల పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు’’
- వంక రవీంద్రనాథ్,
ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత, తణుకు
కేశాల పరిశ్రమకు కష్టకాలం
Published Tue, Mar 8 2016 8:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement