'రియల్ఎస్టేట్ హబ్గా అమరావతిని తయారు చేశారు' | golla baburao takes on chandrababu | Sakshi
Sakshi News home page

'రియల్ఎస్టేట్ హబ్గా అమరావతిని తయారు చేశారు'

Feb 17 2016 1:44 PM | Updated on Jul 28 2018 3:23 PM

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్తో కాలయాపన చేయకుండా... అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు.

విశాఖపట్నం : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్తో కాలయాపన చేయకుండా... అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. కాపులను షెడ్యూల్ - 9లో చేర్చే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని రియల్ఎస్టేట్ హబ్గా తయారు చేశారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి గొల్ల బాబూరావు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement