శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చట్ట బద్ధత కల్పించాలని రాయ సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కనీస నీటి మట్టానికి చట్టబద్ధత కల్పించాలి
Nov 6 2016 11:46 PM | Updated on Sep 27 2018 5:46 PM
కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చట్ట బద్ధత కల్పించాలని రాయ సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో 874 అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకున్న ఘనత టీడీపీదేనని ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 875 అడుగలకుపైన ఉన్న సమయంలో మాత్రమే దిగువన ఉన్న సాగర్కు నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement