- అక్టోబరు 3 నుండి 11 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం
- భక్తుల కోసం నిర్ణయం : టీటీడీ ఈవో సాంబశిరావు
తిరుమల: భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈసారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
రాత్రి 7.30 నుండి 12.30 గంటల వరకు ఊరేగింపు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనం ఉదయం 9 నుండి 11 గంటలు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవ వైభవ ప్రాశస్త్యం నేపథ్యంలో దశాబ్దకాలంగా రద్దీ అనూహ్యంగా పెరిగింది. అందులోనూ గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీన్ని గుర్తించిన టీటీడీ దశాబ్దకాలం గరుడ వాహనం మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తోంది. అయినా భక్తుల రద్దీ మాత్రం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గరుడ సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని అర్థగంటపాటు ముందుగా ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ఆగమ పండితులు, జీయర్లు, అర్చకులతో చర్చించి వారి అనుమతి కూడా పొందారు. ఈ మేరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 7వ తేది రాత్రి 7.30 గంటలకే వాహనం ఊరేగించాలని నిర్ణయించారు. తరలివచ్చే భక్తులందరికీ ఉత్సవమూర్తి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆ రోజు రద్దీని బట్టి రాత్రి 12 నుండి 12.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించారు.
హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం
గరుడ వాహనంలో హారతులు తీసుకొచ్చే భక్తుల సంఖ్యను ఈసారి పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కేవలం 2.2 లక్షల మంది మాత్రమే వేచి ఉండి ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం ఉంది. అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల వెలుపల వేచి ఉంటారు. అలాంటి భక్తుల్లో ఎక్కువ మందిని ఉత్సవమూర్తి దర్శనానికి అనుమతించి వారికి సంతృప్తి దర్శనం కల్పించాలని ఈవో భావిస్తున్నారు. అందుకునుగుణంగా రద్దీని క్రమబద్దీరించాలని అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చారు.
రాత్రి 7.30 గంటలకే గరుడవాహనం: ఈవో సాంబశివరావు
'ప్రతిసారి రాత్రి 8 గంటలకే గరుడవాహనం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకోలేక ఆవేదనతో వెనుతిరుగుతున్నారు. వారందకీ దేవదేవుని దర్శనం కల్పించాలంటే అర్థగంట ముందే వాహనాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే రాత్రి అర్థగంట ఆలస్యమైనా భక్తులకు సంతృప్తి దర్శనం కల్పిస్తాం. ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకునే అవసరమైన చర్యలు చేపడతాం. దాంతోపాటు ఆగమ నిబంధణలు, ఆలయ సంప్రదాయాలు పాటిస్తాం'
- దొండపాటి సాంబశివరావు, టీటీడీ ఈవో
రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడ సేవ
Published Mon, Sep 12 2016 6:37 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement