రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ | Fruits Distrubution to Patients | Sakshi
Sakshi News home page

రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ

Jul 23 2016 6:38 PM | Updated on Sep 4 2017 5:54 AM

పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

ఆత్మకూర్‌ : దివంగత ఏబీవీపీ రాష్ట్ర నాయకులు నరేష్‌కుమార్, రంజిత్‌కుమార్‌ రెండో వర్ధంతిని పురస్కరించుకొని ఎన్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు.

ఆత్మకూర్‌ : దివంగత ఏబీవీపీ రాష్ట్ర నాయకులు నరేష్‌కుమార్, రంజిత్‌కుమార్‌ రెండో వర్ధంతిని పురస్కరించుకొని ఎన్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. శనివారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం  స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. నరేష్‌కుమార్, రంజిత్‌కుమార్‌ విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తు రోడ్డు ప్రమాదంలో మతిచెందడం విద్యార్థిలోకానికి తీరని లోటని బీజేపీ జిల్లా నాయకుడు మేర్వరాజు, మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వారిసేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ యువసేన నాయకులు నరసింహ, దివాకర్, ఖాదర్, పరషురాం, చిరంజీవి, రామకష్ణ, రమేష్, వెంకటేష్, శేఖర్, అరుణ్, సంతోష్, శ్యాం, కిషోర్, రవి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement