ఒకరికొకరం | five students and five teachers | Sakshi
Sakshi News home page

ఒకరికొకరం

Aug 28 2016 11:42 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఒకరికొకరం

ఒకరికొకరం

హిందూపురంలోని కంసల పేటలో ఉన్న వివేకానంద మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

హిందూపురంలోని కంసల పేటలో ఉన్న వివేకానంద మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు.

గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండేవారు. వీరికి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు అప్పట్లో పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. మున్సిపల్‌ పరిధిలోని ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ అటుగా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement