కర్నూలు జిల్లా అహోబిలంలో పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
కర్నూలు : కర్నూలు జిల్లా అహోబిలంలో పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు.