సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు | Fishermen missing at sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు

Aug 12 2016 8:01 PM | Updated on Sep 4 2017 9:00 AM

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్య కారుడు గల్లంతయ్యాడు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులోని సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు శుక్రవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడికి మరబోటు తిరగబడటంతో గరికిన రాజు(20) సముద్రంలో పడి గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు మత్స్య కారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement