చింతపల్లి మండలం కొక్కిరాలతండాలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
చింతపల్లి(నల్గొండ జిల్లా): చింతపల్లి మండలం కొక్కిరాలతండాలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారీ సైలెన్సర్ నుంచి వచ్చిన అగ్గిరవ్వ ప్రత్తికి అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
సుమారు రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.