జిల్లావ్యాప్తంగా రేషన్కార్డుదారుల చేతివేళ్ల ముద్రలు సేకరించే ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల పరిధిలో ఉన్న రేషన్కార్డుల్లోని సభ్యుల చేతివేళ్ల ముద్రలను డీలర్లు ఇంటింటికీ వెళ్లి తీసుకోనున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు.
కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా రేషన్కార్డుదారుల చేతివేళ్ల ముద్రలు సేకరించే ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల పరిధిలో ఉన్న రేషన్కార్డుల్లోని సభ్యుల చేతివేళ్ల ముద్రలను డీలర్లు ఇంటింటికీ వెళ్లి తీసుకోనున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 15 లక్షల రేషన్కార్డులకు సంబంధించి 43 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఇప్పటికే 15 లక్షల మంది వేలిముద్రల సేకరణ పూర్తి చేశామని చెప్పారు. మిగిలినవారి చేతివేళ్ల ముద్రలు సేకరిస్తున్నామని తెలిపారు. కార్డుదారులు రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు సక్రమంగా పడకపోవడంవంటి ఇబ్బందులను అధిగమించేందుకు.. కార్డుదారుల కుటుంబంలోని సభ్యులందరి చేతివేళ్ల ముద్రలూ సేకరిస్తున్నట్టు ఉమామహేశ్వరరావు వివరించారు.