గుడుంబా నిర్మూలన, అక్రమ నల్లబెల్లం వ్యాపారం, రవాణ నిర్మూలించడంలో కృషి చేసిన తొర్రూరు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్కు రా ష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది.
ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్కు రాష్ట్రస్థాయి అవార్డు
Jul 26 2016 12:20 AM | Updated on Sep 4 2017 6:14 AM
తొర్రూరు : గుడుంబా నిర్మూలన, అక్రమ నల్లబెల్లం వ్యాపారం, రవాణ నిర్మూలించడంలో కృషి చేసిన తొర్రూరు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్కు రా ష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది. ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ వీఆర్ చంద్రవదన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ చేతుల మీదు గా ఆయన అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.
Advertisement
Advertisement