ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Erracandanam seized 25 logs | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Nov 22 2016 12:00 AM | Updated on Aug 21 2018 5:51 PM

ఎర్రచందనం దుంగలు స్వాధీనం - Sakshi

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట చెరువు కట్ట సమీపంలోని ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శెట్టిగుంట (రైల్వేకోడూరు రూరల్‌): రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట చెరువు కట్ట సమీపంలోని ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ముళ్ల పొదలలో ఉన్న  దుంగలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 9 దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దొరికిన దుంగలు ఎవరివి, ఎందుకు అక్కడ ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement