కారు బోల్తా : ఎనిమిది మందికి గాయాలు | Eight injured in road accident in anantapur district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ఎనిమిది మందికి గాయాలు

Dec 23 2015 8:09 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది.

అనంతపురం : అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

భక్తులు కారులో హైదరాబాద్ నుంచి శబరిమలై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులది రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement