నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Published Wed, Apr 27 2016 10:16 PM

earthquake in Nellore district

నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement