‘మల్లన్నసాగర్‌’తో సాగునీరు | Drinking water with mallannasagar | Sakshi
Sakshi News home page

‘మల్లన్నసాగర్‌’తో సాగునీరు

Jul 28 2016 1:18 AM | Updated on Oct 8 2018 9:00 PM

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బస్వాపురం రిజర్వాయర్‌ ద్వారా నియోజకవర్గంలోని 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలి పారు.

రామన్నపేట
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బస్వాపురం రిజర్వాయర్‌ ద్వారా నియోజకవర్గంలోని 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలి పారు.  బుధవారం మండలంలోని పల్లివాడలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి రూ.12లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.25లక్షల సీసీరోడ్డు, రూ.4లక్షలతో ఫార్మేషన్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరితహారం కింద మొక్కలను నాటారు.  అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.  చెట్లను బట్టి భూమి విలువను లెక్కగట్టే  కేరళ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కరువును జయించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వీలైనచోటల్లా  మొక్కలను పెంచాలని కోరారు. ప్రతీఇంటికీ ఐదుచొప్పున పండ్లమొక్కలను పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వివరించారు. బోరుమోటారును సమకూరుస్తానని ఎమ్మెల్యే హామీఇవ్వడంతో 20ఎకరాల్లో మొక్కలు నాటడానికి గ్రామస్తులు మందుకు వచ్చారు. లోవోలే్టజీ నివారణకు విద్యుత్‌సబ్‌స్టేçÙన్‌ను మంజూరు చేయాలని, పీహెచ్‌సీలో 24గంటల వైద్యసేవలు అం దేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు.  సర్పంచ్‌ గంగుల వెంకటరాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీడీ కె.జానకిరెడ్డి, డీఈ విష్ణువర్దన్‌రావ్, ఏఈ జి.కొండయ్య, ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, ఆర్‌ఐ డి.జానయ్య, వీఆ ర్‌ఓ సైదులు, పంచాయతీ కార్యదర్శి మానస, బందెల రాములు,కమ్మంపాటి శ్రీనివాస్, యాదగిరి, లింగయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement