స్తంభంపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం | dogs bites all people | Sakshi
Sakshi News home page

స్తంభంపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం

Sep 11 2016 9:05 PM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కకాటు - Sakshi

కుక్కకాటు

బోయినపల్లి : మండలంలోని స్థంబంపల్లి గ్రామంలో ఓ పిచ్చికుక్క ఆదివారం స్వైరవిహారం చేసింది. ఓ మహిళతోపాటు ఇద్దరు చిన్నారులను కరిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్టాండ్‌ ప్రాంతంలో రేచిపల్లి గంగవ్వ (45)పై పిచ్చికుక్క దాడిచేసి కాలు, చేతిపై కరిచింది. తర్వాత ఎడమకన్ను కింది బాగంలో గాయపర్చింది.

  • ఇద్దరు చిన్నారులు, ఓ మహిళకు గాయాలు 
  • బోయినపల్లి : మండలంలోని స్థంబంపల్లి గ్రామంలో ఓ పిచ్చికుక్క ఆదివారం స్వైరవిహారం చేసింది. ఓ మహిళతోపాటు ఇద్దరు చిన్నారులను కరిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బస్టాండ్‌ ప్రాంతంలో రేచిపల్లి గంగవ్వ (45)పై పిచ్చికుక్క దాడిచేసి కాలు, చేతిపై కరిచింది. తర్వాత  ఎడమకన్ను కింది బాగంలో గాయపర్చింది. అనంతరం బీసీ కాలనీలో చేపూరి మిన్ను(5), పొన్నం శివ(4)పై దాడి చేసి వారి చేతులు, కాళ్లను కరిచింది. తర్వాత గ్రామస్తులు ఆ కుక్కను చంపేశారు. రెండు నెలల క్రితం కూడా ఓ పిచ్చికుక్క దాడి చేయగా నర్సయ్య, సుధాకర్‌ తదితరులు గాయపడ్డారు. పిచ్చికుక్కల బెడద నివారించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కస్తూరి బాపురెడ్డి, అల్లూరి రవీందర్‌రెడ్డి అధికారులను కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement