మంట కలిసిన మానవత్వం | Sakshi
Sakshi News home page

మంట కలిసిన మానవత్వం

Published Fri, Sep 16 2016 12:01 AM

మంట కలిసిన మానవత్వం - Sakshi

  • కాలువలో మృత శిశువు లభ్యం
  • సారంగాపూర్‌ మండలంలో భ్రూణ హత్య..!
  • సారంగాపూర్‌ : మానవత్వం మంట కలిసింది. కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిసి నెలలు నిండకుండానే అబార్షన్‌ చేయించుకుని కాలువలో పడేసింది ఓ మనసు లేని తల్లి. మండలంలోని ఆలూరు గ్రామంలో గురువారం ఉదయం బోయివాడ ఇళ్లమధ్యలో ఉన్న పంటకాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం బోయివాడలో స్థానికులు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని గుర్తించారు.
    నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉంటుందని గమనించిన వెంటనే స్థానిక సర్పంచ్‌ చింతకుంట రాజమణికి సమాచారం అందించారు. పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సారంగాపూర్‌ ఎసై ్స శ్రీనివాస్, పీఎస్‌ఐ ఎం.డీ. ఆసీఫ్‌లు అక్కడకు చేరుకుని పంచనామా నిర్వహించారు.
    అలాగే ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తల సహకారంతో గ్రామంలో గర్భిణుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వీఆర్వో సబిత, కారోబార్‌ మురళిలు మృతదేహాన్ని పరిశీలించారు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్‌ చేయించుకుని పారేశారా....? లేదా వివాహేతర సంబంధం అని తప్పుచేశారా అనే కోణంలోఎవరీ తప్పు చేశారు అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
     

Advertisement
Advertisement