రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి | demand on waltail railway zone | Sakshi
Sakshi News home page

రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి

Aug 19 2016 5:17 PM | Updated on Sep 4 2017 9:58 AM

రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి

రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి

విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం విశాఖనగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు.

ద్వారకానగర్‌:  విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం విశాఖనగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సి.హెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. రెండు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ డివిజన్‌ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో కలపడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, విశాఖ మినహా మిగిలిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం త్వరితగతిన సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు విఎస్‌. పద్మనాభరాజు, ఆర్కేస్సీకుమార్, జి.ఎస్‌. రాజేశ్వరరావు, బి.పద్మ, పి. మణి, జి.అప్పలరాజు, సీపీఐ నాయకులు ఎ.జె.స్టాలిన్, డి. మార్కండేయులు, ఎ. విమల, జె.డి .నాయుడు, ఎం. పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement