యువకుడి మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

యువకుడి మృతదేహం లభ్యం

Published Wed, Aug 31 2016 12:47 AM

dead body found

పెంటపాడు: అదృశ్యం కేసు కట్టిన యువకుడి మృతదేహం ఉండి వెంకయ్య వయ్యేరు కాలువలో లభ్యమైనట్టు పెంటపాడు ఎస్సై గుర్రయ్య మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28న  మధ్యాహ్నం నుంచి ముదునూరు గ్రామానికి చెందిన మానే సుధీర్‌ (23) కన్పించడం లేదని అతడి అన్న మహేష్‌ పెంటపాడు పోలీస్‌స్టే షన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని అయితే సుధీర్‌ మృత దేహం కాలువలో లభించడంతో అనుమానాస్పద మృతిగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 
 

Advertisement
Advertisement