ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం | Dcm rams into house beside road, one died | Sakshi
Sakshi News home page

ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం

Mar 10 2017 9:51 AM | Updated on Apr 3 2019 7:53 PM

జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది.

కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉ‍న్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 
యలమంచిలికి చెందిన ఎస్‌కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్‌తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement