పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన | cow competations | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన

Mar 3 2017 11:38 PM | Updated on Sep 5 2017 5:06 AM

పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన

పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన

జంగమహేశ్వరపురం(గురజాల): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతు సంఘ కమిటీ వారు శుక్రవారం ఎద్దుల బండలాగు పోటీలను నిర్వహించారు.

  
జంగమహేశ్వరపురం(గురజాల): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతు సంఘ కమిటీ వారు  శుక్రవారం ఎద్దుల బండలాగు పోటీలను నిర్వహించారు. నాలుగు పళ్ల విభాగం, ఆరు పళ్లవిభాగం, సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతి విభాగంలో ఐదు బహుమతులు అందిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
నాలుగు పళ్ళ విభాగంలో : 
మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎద్దులు 3568 అడుగుల లాగి రూ.20,000 మొదటి బహుమతిని, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి  చెందిన  పి.మురళి ఎద్దులు 3500 అడుగులు లాగి రూ.15,000 రెండవ బహుమతిని, అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన రజిత రెడ్డి ఎద్దులు 3250 అడుగులు లాగి రూ.12,000 మూడవ బహుమతిని, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు  చెందిన సీహెచ్‌. గణేష్‌రెడ్డి ఎద్దులు 3058 అడుగులు లాగి రూ.8,000 నాల్గో బహుమతిని, దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన పెద్దిశెట్టి రాజశేఖర్‌ ఎద్దులు 2788  అడుగులు లాగి రూ. 5,000 ఐదో బహుమతిని గెలుపొందాయి. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.  న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు.కార్యక్రమంలో  నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, ,రెక్కల యలమందారెడ్డి, భవనాశి ఫకీర్‌రెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి, గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఎడ్లపోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో  ప్రజలు హాజరయ్యారు.
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement