తిరుమల: తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కనిపించే చిరుతలు ప్రస్తుతం పగలే కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు జీఎన్సీకి సమీపంలోని తిరుపతికి వెళ్లే 56 వ మలుపు వద్ద ఓ చిరుత కాలిబాట దాటింది. దాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అది కాస్త రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటకుండా అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది.
అదే సమయంలో అటువైపు వచ్చిన ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. అదే సమయంలో వెళ్లిన ద్విచక్రవాహనదారులైన టీటీడీ ఉద్యోగులు కూడా ఆగిపోయారు. ఎక్కడ చిరుత దాడి చేస్తుందోనని వెనక్కు వెళ్లిపోయారు. తర్వాత ఆ చిరుత సాఫీగా అడవిలోకి వెళ్లిపోయిందని టీటీడీ ఉద్యోగి రత్నప్రభాకర్ తెలిపారు. తాము రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ద్విచక్రవాహనంపై వెళుతుంటామని, తొలిసారి పగలు చిరుతను చూశామని తెలిపారు. ఇటీవల చిరుతల సంచారం పెరిగినా టీటీడీ వాటిని బంధించలేమని తేల్చి చెప్పటం గమనార్హం.
చిరుతను చూసి పరుగులు తీసిన భక్తులు
Published Tue, Jul 5 2016 7:30 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement