తిరుమలలో చిరుతల సంచారం | Cheetah wandering in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుతల సంచారం

Jun 26 2016 12:18 PM | Updated on Sep 4 2017 3:28 AM

తిరుమల కొండపై చిరుతల సంచారం ఎక్కువైంది. శనివారం రాత్రి తిరుమల కొండపైన ఉన్న ఓ కార్యాలయం గోడపై చిరుత కూర్చున్నట్లు సీసీ టీవీ ఫూటేజిలో రికార్డు కావడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తిరుమల : తిరుమల కొండపై చిరుతల సంచారం ఎక్కువైంది. శనివారం రాత్రి తిరుమల కొండపైన ఉన్న ఓ కార్యాలయం గోడపై చిరుత కూర్చున్నట్లు సీసీ టీవీ ఫూటేజిలో రికార్డు కావడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు నివసించే బాలాజీనగర్ సమీపంలో శనివారం రాత్రి చిరుతపులి ఓ దుప్పిని వేటాడిన ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా చిరుతల సంచారం పెరిగినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement