'రైతుల పట్ల బాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు' | Chand basha takes on chandrababu | Sakshi
Sakshi News home page

'రైతుల పట్ల బాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు'

Jan 28 2016 1:11 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్బాషా గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్బాషా గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రైతుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement