మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన దుండగలు | Chain snacing in Ranga Reddy district | Sakshi
Sakshi News home page

మంగళసూత్రాన్ని తెంపుకెళ్లిన దుండగలు

Jun 19 2016 6:40 PM | Updated on Mar 28 2018 11:26 AM

బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుపోయారు.

బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుపోయారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన లక్ష్మమ్మ (51) ఆదివారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమె మెడలో ఉన్న మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంపుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement