వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర కమిటీ సభ్యుడు రేవరాజు శ్రీనివాసరాజుకు సంబంధించిన ఎకరా అరటి తోట శుక్రవారం అగ్ని ప్రమాదానికి గురైంది.
రాజంపేట: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర కమిటీ సభ్యుడు రేవరాజు శ్రీనివాసరాజుకు సంబంధించిన ఎకరా అరటి తోట శుక్రవారం అగ్ని ప్రమాదానికి గురైంది. ఊటుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ తోట ఉంది. నాలుగు ఎకరాల్లో ఆయన తోట వేశారు. ఒక ఎకరా అగ్ని ప్రమాదానికి గురైంది. కాయలు అగ్ని కీలలకు కాలిపోయాయి. చెట్లు పనికి రాకుండా పోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో దాదాపు మూడు లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


