చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు | blast in chittoor district court | Sakshi
Sakshi News home page

చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు

Apr 7 2016 12:48 PM | Updated on Apr 3 2019 3:52 PM

చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు - Sakshi

చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు

చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలాజీ నాయుడు(36) అనే గుమాస్తాను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పార్క్ చేసి ఉంచిన స్కూటర్ డిక్కీలో ఈ బాంబు పెట్టినట్లు సమాచారం.

కాగా చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను విచారణలో భాగంగా పోలీసులు ఈ రోజు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పేలుడు జరిగింది. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు  కోర్టు ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement