జంగారెడ్డిగూడెం : ఓ వ్యక్తిని కొట్టి గాయపర్చిన కేసులో నిందితుడికి జై లు, మరో నలుగురికి జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి డి. అజయ్కుమార్ గురువారం తీర్పు చెప్పారని ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలి పారు.
దాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు
Aug 12 2016 1:29 AM | Updated on Oct 16 2018 2:49 PM
జంగారెడ్డిగూడెం : ఓ వ్యక్తిని కొట్టి గాయపర్చిన కేసులో నిందితుడికి జై లు, మరో నలుగురికి జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి డి. అజయ్కుమార్ గురువారం తీర్పు చెప్పారని ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలి పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2014 మే 12న కేమిశెట్టి మల్లికార్జునరావు అనే వ్యక్తిపై ఎం.సత్యనారాయణ, కె.కృష్ణ, కె.శ్రీను, కె.సిం హాచలం, బి.సతీష్ దాడి చేసి గాయపర్చారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఎం.సత్యనారాయణకు ఏడాది జైలు, రూ.2 వేలు, మిగిలిన నలుగురికి ఒక్కొక్కరికీ రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
Advertisement


