ఎస్‌ఎంసీ చైర్మన్‌పై దాడి | attack on smc chairmen | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ చైర్మన్‌పై దాడి

Aug 15 2016 12:06 AM | Updated on Sep 4 2017 9:17 AM

రాజోలు జెడ్పీ హై స్కూల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ బానోత్‌ అర్జున్‌పై ఆదివారం పలువురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు.

రాజోలు(కురవి) : రాజోలు జెడ్పీ హై స్కూల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ బానోత్‌ అర్జున్‌పై ఆదివారం పలువురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. బాధితుడు అర్జున్‌ కథనం ప్రకారం.. బాలు తండాకు చెందిన బానోత్‌ అర్జున్‌ ఇటీవల రాజోలు హైస్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా, అదే తండాకు చెందిన మాలోత్‌ రమేష్, మాలోత్‌ వీరన్న, సురేష్, భద్రు, ధరావత్‌ సుందర్‌లు తండా శివారులో కాపు కాసి అర్జున్‌పై దాడికి పాల్పడ్డారు. దీం తో ఆయన తలకు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. అనంతరం అర్జున్‌ను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement