లేపాక్షి ఆలయంలో పశుగణాభివృద్ధి అధికారులు | apdlo chairman in lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో పశుగణాభివృద్ధి అధికారులు

Jan 28 2017 10:46 PM | Updated on Mar 28 2019 5:39 PM

ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ దొరబాబు, జిల్లా చైర్మన్‌ రాధాకృష్ణయ్య శనివారం సాయంత్రం సందర్శించారు.

లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ దొరబాబు, జిల్లా చైర్మన్‌ రాధాకృష్ణయ్య శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయంలో చిత్రీకరించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, కట్టడాలు అద్భుతంగా నేటికీ ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. ఆలయంలోని నాట్య మండపం, లతామండపం, కల్యాణమండపం, సోమవార మండపాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయాధికారులు వారిని సన్మానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement