రూ.353 కోట్లు బీమా పరిహారం జమ | Sakshi
Sakshi News home page

రూ.353 కోట్లు బీమా పరిహారం జమ

Published Sat, Jul 1 2017 11:21 PM

An amount of Rs 353 crore is deposited in insurance

అనంతపురం అగ్రికల్చర్‌ : వాతావరణ బీమా పరిహారం రూ.353 కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు లీడ్‌ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఖరీఫ్‌–2016కు సంబంధించి 5.07 లక్షల మందికి మంజూరైన రూ.419 కోట్ల పరిహారంలో బజాజ్‌ కంపెనీ నుంచి తొలి విడతగా నాలుగు రోజుల కిందట రూ.153 కోట్లు, రెండో విడతగా శనివారం మరో రూ.200 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా రూ.66 కోట్లు జమ చేసే అవకాశం ఉందన్నారు. ప్రీమియం కట్టిన రైతుల జాబితాలు పరిశీలించిన తర్వాత త్వరలోనే ఖాతాల్లోకి పరిహారం జమ చేయవచ్చని తెలిపారు. 

Advertisement
Advertisement