- నియోజకవర్గంలో సాగు, తాగు నీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
- లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం
- వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి
అనంతపురం : శింగనమల నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈనెల 6న బుక్కరాయసముద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ ఏ మేరకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. రుణమాఫీ చేసిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రూ. 2–3 వడ్డీకి తెచ్చుకుని బ్యాంకుల్లో రెన్యూవల్ చేసుకున్నారన్నారు.
కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటల పెట్టుబడులకు ప్రైవేటుగా అప్పులు చేశారన్నారు. వీటిపై నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దని అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ఓట్లేస్తే.. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మహిళలు వాపోతున్నారన్నారు. మోసపోయిన మహిళలకుS ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారు బయటకు రావాలంటూ బాబు అధికారంలోకి రావాలంటూ ప్రచారాలు చేశారని, ఈరోజు ఒక్క మహిళ బంగారు కూడా విడిపించలేదన్నారు.
చివరకు బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వచ్చాయన్నారు. ఆ మహిళలకు ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, కానీ రెండేళ్లు దాటినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో వేలాదిమంది ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటికితోడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ సమస్య తీర్చలేని చంద్రబాబు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.
ఆయకట్టుకు సంబంధించి రెండేళ్లుగా చుక్క నీరు రాకపోవడంతో రైతులు తమ భూములన్నీ బీళ్లు పెట్టారన్నారు. వెనుకబడిన అనంత జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన రూ. 50 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ, జిల్లా ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమత్రి పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, పుట్లూరు మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం తదితరులు పాల్గొన్నారు.
ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ
Published Thu, Aug 4 2016 9:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement