విశాఖ రైల్వేజోన్‌ కోసం హోరెత్తిన నిరసనలు | all party leaders protests for vizag railway zone | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వేజోన్‌ కోసం హోరెత్తిన నిరసనలు

Sep 14 2016 12:14 PM | Updated on Sep 4 2017 1:29 PM

విశాఖపట్నం రైల్వే జోన్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి వద్ద రైల్వే ట్రాక్ పై నేతలు బెఠాయించారు. ఆందోళ కార్యక్రమాల్లో పాల్గొ‍న్న అఖిలపక్షనేతలను పోలీసులు అక్కడి నుంచి లాక్కెళ్లారు. వైఎస్ఆర్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజులతో పాటూ పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement