టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం | Accident to Guntur young man in Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం

Apr 10 2016 6:22 AM | Updated on Sep 3 2017 9:33 PM

టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం

టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం

అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) తీవ్రంగా గాయపడ్డారు.

సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివశిస్తున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతుల మూడో కుమారుడు జయభారత్‌రెడ్డి టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.

జయభారత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో గదికి వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. శస్త్రచికిత్స చేసిన తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. అమెరికా వెళ్లేందుకు తమకు సహాయం చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావును, కలెక్టర్‌ను కోరనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement