టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు | ACB issues notice to tdp leader drivers over cash for vote case | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు

Jul 17 2015 11:22 AM | Updated on Aug 17 2018 12:56 PM

టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు - Sakshi

టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు

ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన  వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా సీఆర్పీసీ 160 కింద...టీడీపీ నేత డ్రైవర్లకు నోటీసులు ఇచ్చారు.

కాగా ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్‌ రెడ్డిని విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement