ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్తున్న ఆ బాలుడిపై విధి పగబట్టింది. తలకు క్రికెట్ బాలు తగలడంతో మెదడులో గడ్డకట్టి ఆరుచోట్ల ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మూడేళ్లుగా మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నాడు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబ సభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.
* మూడేళ్లుగా మంచానికే పరిమితమైన బాలుడు
* పైప్ద్వారా ఆహారంగా ద్రవ పదార్థాలు
* ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
కర్నూలు : కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గడేకారి మహబూబ్బాషా, షేక్ ఉసేన్బీ దంపతులకు మౌలాలి, దస్తగిరి సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గడేకారి, కూలీపనికి వెళుతూ పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న దస్తగిరి స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడుతున్న సమయంలో 2013వ సంవత్సరంలో తలకు క్రికెట్ బాల్ తగిలింది.
మొదట్లో దాని ప్రభావం కన్పించకపోగా కొంతకాలానికి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు, నంద్యాల ఆసుపత్రులకు తీసుకెళ్లగా ఎక్స్రేలో మెదడులో గడ్డ ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, దాతల సాయం, దొరికిన చోటంతా రూ. 2 లక్షల వరకు అప్పు చేసి హైదరాబాదులోని నిమ్స్లో గడ్డను తొలగించేందుకు తల, మెడ, గొంతు, తదితర చోట్ల ఆరు ఆపరేషన్లు చేయించారు.
ఆపరేషన్ అనంతరం దస్తగిరి యథావిధిగా కోలుకుంటారని భావించారు. ఎక్కువ చోట్ల ఆపరేషన్లు జరగడంతో అప్పటి నుంచి మంచానికి పరిమితం అయ్యాడు. ఆహారపదార్ధాలను ద్రవరూపంలో ముక్కుకు అమర్చిన పైప్ద్వారా అందజేయాల్సి వస్తోంది. ఆడుతూ, పాడుతూ జీవనం సాగిస్తున్న కుమారుడికి ఈ పరిస్థితి రావడంతో తండ్రి షాక్కు గురై.. మానసిక స్థితి సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లాడు. కుమారుడి ఆలనాపాలన తల్లి చూస్తోంది. ఆమె ఇంటికే పరిమితం కావడంతో పోషణభారం పెద్దకుమారుడైన మౌలాలిపై పడింది.
గడేకారి పనిచేస్తూ కుటుంబ పోషణ..
తమ్ముడు అనారోగ్యంతో మంచాన పడే సమయానికి పదో తరగతి పూర్తి చేసుకున్న మౌలాలి చ దువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇల్లు లేక వీరు.. వనం ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకుంటూ ఉండడంతో గ్రామానికి చెందిన ఉసేనయ్య ఆదుకున్నాడు. ప్రస్తుతం హుసేనయ్య ఇంట్లో వీరు ఉంటున్నారు. మౌలాలి.. గడేకారి పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ, తమ్ముడి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. మాత్రలు, మందుల కోసం నెలకు రూ. 5వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది.
దాతల సాయం కోసం ఎదురుచూపు
మూడేళ్లుగా మంచానికే పరిమితమైన దస్తగిరికి మెరుగైన వైద్యం అందితే యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అంతటి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. నెలకు కావాల్సిన మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. దాతలు ఆపన్న హస్తం అందించి కుమారుడికి పునర్జన్మను ప్రసాదించాలని తల్లి, కుమారుడు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేసేందుకు 8186815860 నంబర్కు సంప్రదించాలని కోరారు.
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం
Published Wed, Jun 22 2016 8:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement