ట్రాక్టర్ బోల్తా.. 9 మందికి గాయాలు | 9 injured in road accident, Tractor turned | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. 9 మందికి గాయాలు

Mar 27 2016 3:15 PM | Updated on Jun 4 2019 5:16 PM

పసుపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

రేపల్లె(గుంటూరు): పసుపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన 9 మంది పసుపు రైతు కూలీలు ట్రాక్టర్‌పై పసుపు పంటను అమ్మడానికి వెల్లటూరు వెళ్తున్నారు.

ఈ సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement