200 మంది ముస్లింల పుష్కర స్నానం... | 200 members Muslims holly puska | Sakshi
Sakshi News home page

200 మంది ముస్లింల పుష్కర స్నానం...

Aug 19 2016 4:58 PM | Updated on Oct 16 2018 6:01 PM

200 మంది ముస్లింల పుష్కర స్నానం... - Sakshi

200 మంది ముస్లింల పుష్కర స్నానం...

దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్‌ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్‌ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్‌ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్‌ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సత్రశాల పుష్కర ఘాట్‌లో పరాశక్తి సిమెంట్స్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో పుష్కరాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అచ్చంపేట మండలం నందులరేవు పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తుండగా హఠాత్తుగా కొండచిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు. పోలీసులు దాన్ని చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement