పంట మునిగిందని రైతు ఆత్మహత్య | Man Committed Suicide | Sakshi
Sakshi News home page

పంట మునిగిందని రైతు ఆత్మహత్య

Aug 18 2018 12:31 PM | Updated on Oct 1 2018 2:36 PM

Women  Committed Suicide  - Sakshi

రాజయ్య మృతదేహం 

మంచిర్యాలక్రైం : మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌ పరధిలోని ర్యాలీగఢ్‌పూర్‌ గ్రామంలోని బాబానగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజయ్య (55) శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలి.. ఇటీవల మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో ర్యాలీవాగు సమీపంలో ఉన్న రాజయ్య పత్తి సేను పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement