నన్ను చంపేస్తారు..

Woman Case Files Against Husband Family - Sakshi

ప్రాణహాని ఉందంటూవివాహిత ఫిర్యాదు

బంజారాహిల్స్‌: అదనపు కట్నం కోసం భర్త, అత్త, ఆడబిడ్డ తనను చంపి పూడ్చిపెట్టేందుకు గొయ్యి కూడా తీశారని వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... ఫిలింనగర్, వినాయకనగర్‌కు ఉల్కుంద జ్యోతి, సతీష్‌ 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్నేళ్లుగా తన అత్త, ఆడబిడ్డ, భర్త రూ.10 లక్షల ఆదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం రాత్రి తనను చంపి, పూడ్చిపెట్టేందుకు ఇంటి సమీపంలో ముగ్గురూ కలిసి  గొయ్యి తీస్తున్నారని, వారి భారినుంచి తప్పించుకుని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top