భార్యాభర్తలను ఢీ కొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌ | Wife And Husband Died In Visakapatnam Road Accident | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ట్యాంకర్‌ ఢీ, భార్యాభర్తల మృతి

Nov 1 2019 8:13 AM | Updated on Nov 1 2019 9:08 AM

Wife And Husband Died In Visakapatnam Road Accident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తాళపాలెం జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై  గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఉదయాన్నే పొలానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన దంపతులు విశాఖలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు(55), కరణం పైడితల్లి(50)గా పోలీసులు గుర్తించారు. కాగా లారి డ్రైవర్‌ పరారీలో ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement