ప్యాసింజర్‌ రైలుకు తప్పిన ప్రమాదం | Vijayawada machilipatnam Passenger Rail Derailed At Gudlawalleru In Krishna District | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ రైలుకు తప్పిన ప్రమాదం

May 14 2019 8:06 PM | Updated on May 14 2019 8:26 PM

Vijayawada machilipatnam Passenger Rail Derailed At Gudlawalleru In Krishna District - Sakshi

కృష్ణా జిల్లా: విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద ప్యాసింజర్‌ రైలు, పట్టాలపై ఉన్న గేదెలను ఢీకొట్టడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టం బాగుండి ప్రయాణికులకు ఏంకాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement