క్షుద్రపూజల కోసం మహిళల నరబలి! | Two Women Killed In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళల దారుణ హత్య

Jan 22 2019 10:29 PM | Updated on Jan 22 2019 10:43 PM

Two Women Killed In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లంగర్‌ హౌజ్‌ పరిధిలోని మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. మహిళలను చంపిన దుండగులు మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి మహిళల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో  క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement