గుంటూరు జిల్లాలో విషాదం | Two Women Died And Five In Gas Cylinder Blast In Guntur | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి

Oct 1 2019 1:50 PM | Updated on Oct 1 2019 2:13 PM

Two Women Died And Five In Gas Cylinder Blast In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట ఎన్టీఆర్‌ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్‌ స్టౌవ్‌ రిపేర్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీకి చెందిన ఆది లక్ష్మీ ఈ రోజే  కొత్తగా గ్యాస్‌ సిలిండర్‌ను కొనుక్కొచ్చారు. గ్యాస్‌ పొయ్యిని సిలిండెర్‌కు కలెక్షన్‌ ఇచ్చేందుకు పక్కింటి దివ్యను పిలిచారు. గ్యాస్‌ స్టౌవ్‌ రిపేర్‌ చేస్తుండగా సిలిండర్‌ పేలింది. ఈ ఘటన రేకుల షెడ్డు పేలి దివ్య, ఆదిలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు.ఇంట్లో ఉన్న మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement