ఆ యువకులు మృత్యుంజయులు | Two Teenagers Survived Road Accident Gudur | Sakshi
Sakshi News home page

ఆ యువకులు మృత్యుంజయులు

Jun 21 2019 7:56 AM | Updated on Jun 21 2019 7:58 AM

Two Teenagers Survived  Road Accident Gudur - Sakshi

సాక్షి, నెల్లూరు : రూరల్‌ పరిధిలోని పోటుపాళెం జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన శశిధర్, గణేష్‌లు బైక్‌పై నెల్లూరు నుంచి గూడూరుకు వస్తున్నారు. కూడలి వద్ద మలుపు తిరిగే క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపునకు వెళుతున్న కంటైనర్‌ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌ కంటైనర్‌ కిందికి వెళ్లి దెబ్బతింది. ఈ ప్రమాదంలో శశిధర్, గణేష్‌లకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో శశిధర్‌ ఒక్కసారిగా భీతిల్లిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement