ఒడిశాలో ఎన్‌కౌంటర్లు.. ఆరుగురు మావోలు హతం | Two dreaded Maoists killed in encounter | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఎన్‌కౌంటర్లు.. ఆరుగురు మావోలు హతం

May 14 2018 4:54 AM | Updated on Oct 9 2018 2:39 PM

Two dreaded Maoists killed in encounter - Sakshi

మల్కన్‌గిరి: ఒడిశాలోని బలంగీర్‌ జిల్లా కోప్రకోల్‌ సమితి డుడ్కమాల్‌ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు అందిన సమాచారంతో బలంగీర్‌ ఎస్పీ శివసుబ్రహ్మణ్యం ఆదేశాలతో సీఆర్పీఎఫ్, డీబీఎఫ్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద రాకేశ్, సంజీవ్‌ అనే ఇద్దరు మావో కమాండర్లు కనిపించి పోలీసులపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో వారిద్దరూ మృతిచెందారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగించారు. అర్థరాత్రి సమయంలో మరోసారి జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. కాగా, మావోయిస్టు సంజీవ్‌పై ఒడిశా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement