ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ! | theft in A.S.Rao nagar | Sakshi
Sakshi News home page

ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ!

Jan 16 2018 7:27 PM | Updated on Sep 4 2018 4:52 PM

సాక్షి, కుషాయిగూడ: ఇంట్లోని వాళ్లు నిద్రిస్తుండగానే దొంగలు లోనికి చొరబడి ఎంచక్కా తమ పని కానిచ్చుకుని వెళ్లిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ ఎ.ఎస్.రావు నగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదిమల్లు అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో దొంగలు చాకచక్యంగా ఆ ఇంటి తలుపు గడియ తొలగించి లోపలికి జొరబడ్డారు. పది తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement