పెద్దాపురం: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతున్న విద్యార్థి ప్రమాదబారినపడి ఆఖరి పరీక్ష రాయలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం పట్టణంలోని కట్టమూరు పుంతకు చెందిన బొంగు శ్రీరామ్ (16) స్థానిక సాగర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో పద్మనాభ కాలనీ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్నాడు. ఆఖరి పరీక్ష సోషల్ ఎగ్జామ్ రాసేందుకు మంగళవారం ఇంటి వద్ద నుంచి బైక్పై బయల్దేరి పెట్రోలు కొట్టించుకునేందుకు వచ్చి తిరిగి ఎగ్జామ్ సెంటర్ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక లలితా థియేటర్ కాంప్లెక్స్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఏపీ05టీడీ 3373 బస్సు బలంగా ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీనిని గమనించిన స్థానికులు బస్సు నంబరును నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అప్పటికే శ్రీరామ్ తీవ్ర గాయాలపాలై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆఖరి పరీక్ష రాయలేక పోయాడు
Published Wed, Mar 28 2018 1:12 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement